ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

ABN , First Publish Date - 2022-05-29T06:12:07+05:30 IST

ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఏపీ ఏన్జీవో అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సతీష్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
జిల్లా నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ప్రభుత్వ ఉద్యోగులు

నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట నిరసన

గుంటూరు(తూర్పు), మే 28: ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఏపీ ఏన్జీవో అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సతీష్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు ఏపీ ఏన్జీవో అసోసియేషన్‌ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం నీటి పారుదల శాఖ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. హామీలను నెరవేర్చని పక్షంలో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఎస్‌.వెంకటరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, జానీబాషా, శ్యామ్‌ సుందర్‌, శివజ్యోతి, సుకుమార్‌, రాధారాని, రమ్య, అనిల్‌కుమార్‌, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-05-29T06:12:07+05:30 IST