ఏడాదిలో 275 మందికి ఉద్యోగం

ABN , First Publish Date - 2021-07-30T07:17:10+05:30 IST

గడిచిన ఏడాది కాలంలో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన 275 మంది విద్యార్థినులు ఉద్యోగావకాశాలు పొందారు.

ఏడాదిలో 275 మందికి ఉద్యోగం
ఎంపికైన వారితో వీసీ ప్రొఫెసర్‌ దువ్వూరు జమున

అవకాశం చేజిక్కించుకున్న ‘శ్రీ పద్మావతి’ ఇంజనీరింగ్‌ విద్యార్థినులు 


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జూలై 29: గడిచిన ఏడాది కాలంలో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన 275 మంది విద్యార్థినులు ఉద్యోగావకాశాలు పొందారు. ఈ మేరకు వర్సిటీ కెరీర్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌- ఇంజినీరింగ్‌ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వర్సిటీలో సంబరాలు నిర్వహించారు. ఏడాదిలో 275 మంది ఉద్యోగావకాశాలు పొందడంపై వీసీ జమున హర్షం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థిని ఉన్నత భవిష్యత్తును ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని విద్యార్థులు సమన్వయం చేసుకోవాలని రెక్టార్‌ శారద సూచించారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత జీవితంతో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడాలని రిజిస్ట్రార్‌ మమత పేర్కొన్నారు. విద్యార్థులు ఉద్యోగావకాశాలు పొందడానికి అవసరమైన అవగాహనను అందిస్తున్నామని ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ ఉష తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్‌ కాలేజీ డైరెక్టర్‌ రామకృష్ణారావు, పీఆర్వో శోభ, పలువురు అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T07:17:10+05:30 IST