Encounter: ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్.. తప్పించుకున్న కీలక నేతలు

ABN , First Publish Date - 2022-08-19T20:53:41+05:30 IST

భద్రాద్రి-ములుగు జిల్లాల సరిహద్దుల్లో శుక్రవారం ఎన్ కౌంటర్ (En counter) జరిగింది.

Encounter: ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్.. తప్పించుకున్న కీలక నేతలు

ములుగు జిల్లా (Mulugu Dist.): తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి-ములుగు జిల్లాల సరిహద్దుల్లో శుక్రవారం ఎన్ కౌంటర్ (En counter) జరిగింది. తాడ్వాయి-గుండాల అడవుల్లో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో మావోయిస్టులు (Maoists) మకాం వేశారని పోలీసులకు సమాచారం అందడంతో... సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే పోలీసుల కాల్పుల నుంచి మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్నారు. సంఘటన ప్రదేశంలో మావోయిస్టులకు సంబంధించిన వస్తుసామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కుంబింగ్ కొనసాగుతోంది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-08-19T20:53:41+05:30 IST