ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు

ABN , First Publish Date - 2022-03-14T00:47:36+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా కేర్లపాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి చిచోర్‌గూడ అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు

ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు

దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా కేర్లపాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి చిచోర్‌గూడ అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లో ఇద్దరు డీఆర్జీ జవాన్లు గాయపడ్డారు. కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు ఒక్కసారిగా మావోయిస్టులు తారసపడడంతో గంటపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గాయపడిన జవాన్లను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసు బలగాలు కూంబింగ్‌ను మరింత ముమ్మరం చేశాయి. కాల్పుల్లో మావోయిస్టులు మరణించడం లేదా తీవ్రంగా గాయపడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-03-14T00:47:36+05:30 IST