England vs India: పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్..100 పరుగులైనా చేసేనా?

ABN , First Publish Date - 2022-07-13T00:27:58+05:30 IST

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

England vs India: పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్..100 పరుగులైనా చేసేనా?

లండన్: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్‌(Team India)తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ (Engaland) పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లిష్ భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) దెబ్బకు గింగిరాలు తిరిగింది. 59 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ల విజృంభణ చూస్తుంటే ఇంగ్లండ్ 100 పరుగులు చేయడం కూడా కష్టమేనని అనిపిస్తోంది.


కెప్టెన్ జోస్ బట్లర్ కాసేపు క్రీజులో కుదురుకున్నప్పటికీ షమీ అతడిని తెలివిగా బోల్తా కొట్టించాడు. 32 బంతుల్లో ఆరు ఫోర్లతో 30 పరుగులు చేసిన బట్లర్ ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. జాసన్ రాయ్, జో రూట్, బెన్‌స్టోక్స్ ముగ్గురూ డకౌట్ అయ్యారు. మొయిన్ అలీ 14 పరుగులు చేశాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిశాయి. ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. డేవిడ్ విల్లీ, క్రెయిగ్ ఒవెర్టన్ క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ కోల్పోయిన ఏడు వికెట్లలో బుమ్రాకు నాలుగు దక్కగా, షమీ మూడు వికెట్లు పడగొట్టాడు.

Updated Date - 2022-07-13T00:27:58+05:30 IST