బర్మింగ్ హామ్ టీ 20లో టీమిండియా ఘన విజయం
ABN , First Publish Date - 2022-07-10T04:00:51+05:30 IST
ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై ..
బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై టీమిండియా గెలిచింది. 17 ఓవర్లలో 121 పరుగుల చేసిన ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. 3 టీ ట్వంటీల సిరీస్లో టీమిండియా.. 2 మ్యాచ్లు గెలిచి కప్ను సొంతం చేసుకుంది. మిగిలిన మరో మ్యాచ్ నాటింగ్హామ్లో జరగనుంది.
ఇంగ్లండ్ స్కోర్:121/10, ఇండియా స్కోర్: 170/8
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన రోహిత్ సేనకు ఆరంభం బాగున్నా ఆ తర్వాత వరుసగా వికెట్లు చేజార్చుకుంది. 49 పరుగుల వద్ద రోహిత్ శర్మ (31) రూపంలో తొలి వికెట్ కోల్పోయిన భారత్.. 61 పరుగుల వద్ద కోహ్లీ (1), రిషభ్ పంత్ (26) వికెట్లను కోల్పోయింది.
ఆ తర్వాత కూడా వరుస షాకులు తగిలాయి. అయితే, రవీంద్ర జడేజా క్రీజులో కుదురుకోవడంతో జట్టు భారీ స్కోరు చేయగలిగింది. 29 బంతులు ఎదుర్కొన్న జడేజా 5 ఫోర్లతో 46 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 15, పాండ్యా 12, కార్తీక్ 12, హర్షల్ పటేల్ 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4, రిచర్డ్ గ్లీసన్ 3 వికెట్లు తీసుకున్నారు.
ఇక 170 పరుగుల టార్గెట్ ఛేదనకు దిగిన ఇంగ్లండ్ వరుస వికెట్లు కోల్పోయింది. ఫలితంగా మ్యాచ్ ఓడిపోయింది. మొయిన్ అలీ 35, డేవిడ్ విల్లే 33 పరుగులు చేశారు. మిగిలిన వారెవరూ కూడా ఎక్కువ పరుగులు చేయలేకపోయారు.