ఐపీఎల్-14: మిగతా సీజన్కు ఇంగ్లండ్ ఆటగాళ్లు దూరం?
ABN , First Publish Date - 2021-05-11T21:11:31+05:30 IST
దేశంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతోపాటు పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడడంతో ఐపీఎల్-14ను బీసీసీఐ వాయిదా వేసింది.
దేశంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతోపాటు పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడడంతో ఐపీఎల్-14ను బీసీసీఐ వాయిదా వేసింది. సగం మ్యాచ్లు ఇంకా జరగాల్సి ఉండడంతో ఈ ఏడాదిలోనే మిగతా సీజన్ను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో యూఏఈ వేదికగా ఐపీఎల్-14 మిగతా సీజన్ను జరపాలని చూస్తోంది. అయితే ఆ సమయానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని ఈసీబీ ఎండీ ఆష్లే గైల్స్ చెప్పాడు. అక్టోబర్లో ఇంగ్లండ్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుందని, దేశం తరఫున ఆడేందుకే ఆటగాళ్లు ఆసక్తి చూపుతారనుకుంటున్నానని గైల్స్ అన్నాడు.