England vs India: తొలి రెండు టెస్టులకు జట్టు ప్రకటన

ABN , First Publish Date - 2021-07-22T01:34:39+05:30 IST

భారత్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు ఆతిథ్య ఇంగ్లాండ్ బుధవారం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

England vs India: తొలి రెండు టెస్టులకు జట్టు ప్రకటన

భారత్‌తో తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు ఆతిథ్య ఇంగ్లాండ్ బుధవారం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆ జట్టు ప్రధాన కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ జట్టు వివరాలను వెల్లడించారు. గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ ఈ రెండు టెస్టులకు దూరమయ్యారు. వివాదాస్పద ట్వీట్లతో జట్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్‌సన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా, మొదటి టెస్టు ట్రెంట్ బ్రిడ్జి వేదికగా ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. 


ఇంగ్లాండ్ జట్టు:

జో రూట్(కెప్టెన్), జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, డామ్ బెస్స్, రాయ్ బర్న్స్, జాస్ బట్లర్(వికెట్ కీపర్), జాక్ క్రావ్లీ, సామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారేన్స్, జాక్ లీచ్, ఓలీ పోప్, ఓలీ రాబిన్‌సన్, డామ్ సిబ్లీ, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్  

Updated Date - 2021-07-22T01:34:39+05:30 IST