ఇంగ్లండ్ జట్టు భారత టూర్ వాయిదా
ABN , First Publish Date - 2020-08-08T09:16:15+05:30 IST
ఈ సెప్టెంబరు-అక్టోబరు మాసాల్లో భారత్ వేదికగా జరగాల్సిన ఇంగ్లండ్ జట్టు పర్యటన కొవిడ్ కారణంగా వాయిదా పడింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో చర్చించిన అనంతరం ...
ముంబై: ఈ సెప్టెంబరు-అక్టోబరు మాసాల్లో భారత్ వేదికగా జరగాల్సిన ఇంగ్లండ్ జట్టు పర్యటన కొవిడ్ కారణంగా వాయిదా పడింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో చర్చించిన అనంతరం సిరీ్సను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్టు బీసీసీఐ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇక, ముందస్తు షెడ్యూల్ ప్రకారం వచ్చే వేసవిలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్ అక్కడికి వెళ్లనుంది. దీనికంటే ముందే వాయిదా పడిన టీ20 సిరీ్సను నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు సమాలోచనలు చేస్తున్నాయి. దీనిపై బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడుతూ ‘భారత్-ఇంగ్లండ్ మధ్య క్రికెట్ సమరానికున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టీ20 సిరీ్సను నిర్వహించలేక వాయిదా వేస్తున్నాం. వచ్చే ఏడాది కచ్చితంగా ఈ సిరీస్ జరుపుతాం. త్వరలోనే తేదీలను ఖరారు చేసి షెడ్యూల్ను విడుదల చేస్తాం’ అని చెప్పాడు.