England vs India : టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. తొలుత ఏం ఎంచుకుందంటే.. టీమిండియాలో 4 మార్పులు

ABN , First Publish Date - 2022-07-11T00:18:56+05:30 IST

ఇండియా - ఇంగ్లాండ్ మూడో టీ20లో టాప్ పడింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా ఫలితం మారుతుందని ఆశిస్తున్నామని బట్లర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

England vs India : టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. తొలుత ఏం ఎంచుకుందంటే.. టీమిండియాలో 4 మార్పులు

బర్మింగ్‌హామ్ : ఇండియా - ఇంగ్లాండ్(India - England) మూడో టీ20లో టాస్ పడింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్(Jos buttler) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా ఫలితం మారుతుందని ఆశిస్తున్నట్టు బట్లర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. జట్లులో రెండు మార్పులు చేస్తున్నాం.. పార్కిన్సన్, కర్రాన్ స్థానాల్లో రీసీ టొప్లీ, ఫిల్ సాల్ట్‌ని జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు.


టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడుతూ.. బౌలింగ్‌లో కొన్ని ప్రయత్నాలు చేయాలనుకున్నాం. అందుకు అనుగుణంగా మార్పులు చేశామని చెప్పాడు. భువనేశ్వర్, బుమ్రా, చాహల్, హార్ధిక్ పాండ్యా స్థానాల్లో బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, శ్రేయస్ అయ్యర్‌లను జట్టులోకి తీసుకున్నామని రోహిత్ శర్మ చెప్పారు. 


ఇండియా జట్టు : 

రోహిత్ శర్మ(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయ్.


ఇంగ్లాండ్ జట్టు :

జసన్ రాయ్, జాస్ బట్లర్(వికెట్ కీపర్, కెప్టెన్), డేవిడ్ మలన్, ఫిలిప్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, డేవిడ్ విల్లే, క్రిస్ జోర్డాన్, రిచర్డ్ గ్లీసన్, రీసె టొప్లే.

Updated Date - 2022-07-11T00:18:56+05:30 IST