అలరించిన నృత్య ప్రదర్శన

ABN , First Publish Date - 2021-10-28T04:03:43+05:30 IST

గిద్దలూరుకు చెందిన న్యాయవాది ముత్తుముల రంగారెడ్డి, పద్మావతి దంపతుల కుమార్తె భవనసహస్ర నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది.

అలరించిన నృత్య ప్రదర్శన
ప్రశంసాపత్రం అందుకుంటున్న సహస్ర


గిద్దలూరు, అక్టోబరు 27 : గిద్దలూరుకు చెందిన న్యాయవాది ముత్తుముల రంగారెడ్డి, పద్మావతి దంపతుల కుమార్తె భవనసహస్ర నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. శ్రీశైల దేవస్థానంలో నిర్వహించిన నిత్య కళారాధన థార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆలయ దక్షిణమాడ వీధిలో భరతనాట్య ప్రదర్శన, ఇతర నృత్యప్రదర్శనలు నిర్వహించగా గిద్దలూరుకు చెందిన భవన సహస్ర అనే చిన్నారి అటు గ్రూపులోను, వ్యక్తిగతంగాను చేసిన నృత్యం అందరినీ అలరించింది. ఈసందర్భంగా నిర్వాహకులు సహస్రను అభినందించి ప్రశంసాపత్రం అందచేశారు.


Updated Date - 2021-10-28T04:03:43+05:30 IST