ఉత్సాహంగా తిక్కయ్యస్వామి ఉట్ల పరుష

ABN , First Publish Date - 2021-04-18T06:07:58+05:30 IST

మం డల కేంద్రంలో శనివారం తి క్కయ్యస్వామి ఉట్ల పరుషను అత్యంత ఉత్సాహంగా నిర్వ హించారు.

ఉత్సాహంగా తిక్కయ్యస్వామి ఉట్ల పరుష
ఉట్లమాను ఎక్కేందుకు పోటీపడుతున్న యువకులు

నార్పల, ఏప్రిల్‌17: మం డల కేంద్రంలో శనివారం తి క్కయ్యస్వామి ఉట్ల పరుషను అత్యంత ఉత్సాహంగా నిర్వ హించారు. ఉదయం నుంచి ఆలయంలో తిక్కయ్య స్వా మిని అభిషేకించి, ప్రత్యేకంగా అలంకరించారు. ఆకుపూజ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఆల య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉట్లమాను ఎక్కడం కోసం యువకులు పడిన తీరు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. చివరకు నార్పలకు చెందిన తలారి అరుణ్‌ ఉట్లమాను ఎక్కి రూ. 1016ను బహుమతిగా గెలుపొందారు. అలాగే టెంకాయలు పగులగొట్టే కార్యక్రమం నిర్వహించగా... అందులో తలారి నాగార్జున విజయం సాధించాడు. ఉట్టప రుషను తిలకించేందుకు నార్పల నుంచే కాకుండా చుట్టుపక్కల గామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గాజులు, స్వీట్ల అంగళ్ల వద్ద కొనుగోలు చేశారు. మొరుసు బద్రర్స్‌ రమణ ఆధ్వర్యంలో మజ్జిగ, తాగు నీటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు సత్యనారాయణ రెడ్డి, చిన్ని, మాజీ సర్పంచ ఆకుల నాగలలిత తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-18T06:07:58+05:30 IST