గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2021-10-27T06:23:04+05:30 IST
గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
అవనిగడ్డ రూరల్, అక్టోబరు 26: పులిగడ్డ గురుకుల విద్యాలయంలో 2021-22 విద్యాసంవత్సరానికి 5, 7, 8, 9 తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్.టి.పి. కుమార్ మంగళవారం తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తామని, అర్హులైన విద్యార్థులు విద్యాలయంలో ఈనెల 30వ తేదీ లోపుగా దరఖాస్తులు అందించాలని, 9866559628లో సంప్రదించాలని ఆయన సూచించారు.