Eps, Opsతో బీజేపీ నేతల భేటీ

ABN , First Publish Date - 2022-06-24T13:41:59+05:30 IST

అన్నాడీఎంకే నేతలు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వంను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సీటీ

Eps, Opsతో బీజేపీ నేతల భేటీ

చెన్నై, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే నేతలు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వంను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సీటీ రవి వేర్వేరుగా వారి నివాసాల్లో గురువారం మధ్యాహ్నం కలుసుకున్నారు. అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశం రసాభాసగా ముగిసిన నేపథ్యంలో బీజేపీ నేతలు వీరిని కలుసుకోవడం కలకలం సృష్టించింది. త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని కోరేందుకు అన్నాడీఎంకే నేతలను కలుసుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈపీఎస్‌, ఓపీఎస్‌ సర్దుకుపోవాలని కూడా బీజేపీ నేతలు సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.

Updated Date - 2022-06-24T13:41:59+05:30 IST