బండి సంజయ్ ,కిషన్ రెడ్డిలు అసలు రైతు బిడ్డలేనా..?: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2021-12-25T00:08:37+05:30 IST
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డిలు అసలు రైతు బిడ్డలేనా..? అని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు.
ఢిల్లీ: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డిలు అసలు రైతు బిడ్డలేనా..? అని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ధాన్యంలో ఎందుకు రాతపూర్వకంగా ఇవ్వడం లేదని నిలదీశారు. రైతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. 60 లక్షల పైగా వచ్చే ధాన్యాన్ని కొని ఇండియా గేట్ ముందు పోసి ఇక్కడే, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి నిరసన తెలుపుతామని ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు.