గడ్డికోసం పొలానికెళ్లిన మహిళపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించిందని..!

ABN , First Publish Date - 2022-03-08T12:39:26+05:30 IST

గడ్డికోసం పొలానికెళ్లిన మహిళపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించిందని..!

గడ్డికోసం పొలానికెళ్లిన మహిళపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించిందని..!

  • చంపి బావిలో పడేసిన నిందితుడు


చిత్తూరు జిల్లా/ఎర్రావారిపాలెం : అత్యాచారయత్నాన్ని ప్రతిఘటించిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు.. ఎర్రావారి పాలెం మండలం నెరబైలు పంచాయతీకి చెందిన ఓ మహిళకు ఇద్దరు పిల్లలు. జీవనోపాధి కోసం భర్త  కువైట్‌ వెళ్లడంతో రెండు పాడిఆవులను మేపుకుంటూ పిల్లలను చదివించుకుంటోంది. సోమవారం  మధ్యాహ్నం గడ్డికోసం పొలం వద్దకు వెళ్ళిన ఆమెపై ఓ కామాంధుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి చంపేశాడు. వంద మీటర్ల దూరంలో ఉన్న పాడుబడిన బావిలో శవాన్ని పడేశాడు. ఈ విషయమై పక్క పొలానికి చెందిన వ్యక్తి సమాచారమివ్వడంతో సీఐ తులసీరాం, ఎస్‌ఐ వెంకట మోహన్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్‌ స్క్వాడ్‌ను కూడా రప్పించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లి ఆకస్మిక మరణంతో ఇద్దరు పిల్లలు దిక్కుతోచక కన్నీరుమున్నీరవుతున్నారు.ఈ హత్య కేసుకు సంబంధించి మృతురాలి సమీప బంధువును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - 2022-03-08T12:39:26+05:30 IST