కూలీలకు ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలి

ABN , First Publish Date - 2021-12-07T05:30:00+05:30 IST

రైస్‌ మిల్లుల కూలీలకు ఈఎస్‌ఐ, పీ ఎఫ్‌, వెల్ఫేర్‌ ఫండ్‌ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు తహశీల్దార్‌ బి.పాపారావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు.

కూలీలకు ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలి
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న సీఐటీయూ నాయకులు

మందస: రైస్‌ మిల్లుల కూలీలకు ఈఎస్‌ఐ, పీ ఎఫ్‌, వెల్ఫేర్‌ ఫండ్‌ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు తహశీల్దార్‌ బి.పాపారావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అక్టోబరుతో యాజమాన్యంతో కుదిరిన ఒప్పందం ముగిసిందన్నారు. రైస్‌మిల్లు కార్మికుడు పి.జగన్నాథం కుటుంబానికి మిల్లు యాజమాన్యం పరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆర్‌.దిలీప్‌, కేశవరావు, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-07T05:30:00+05:30 IST