ప్రజల సౌకర్యార్థం సమీకృత మార్కెట్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-05-26T07:15:40+05:30 IST

పట్టణ ప్రజల సౌకర్యార్థం ఖానాపూర్‌లో సమీకృత మార్కెట్‌ ఏర్పాటు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అ న్నారు.

ప్రజల సౌకర్యార్థం సమీకృత మార్కెట్‌ ఏర్పాటు
భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే రేఖానాయక్‌

ఖానాపూర్‌, మే 25 : పట్టణ ప్రజల సౌకర్యార్థం ఖానాపూర్‌లో సమీకృత మార్కెట్‌ ఏర్పాటు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అ న్నారు. ఈ మేరకు పట్టణంలోని తహసీల్దార్‌ బంగ్లా ఆవరణలో బుధవారం సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా రూ, 3.90 కోట్లతో నిర్మిస్తున్న ఈ సమీకృత మార్కెట్‌లో వెజ్‌ స్టాల్స్‌, నాన్‌వెజ్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేంధర్‌, వైస్‌ చైర్మన్‌ ఖలీల్‌, మార్కెట్‌ కమిటీ  చైర్మన్‌ పుప్పాల శంకర్‌, కౌన్సిలర్‌లు కుర్మ శ్రీను, సంతోష్‌, పరిమి లత పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T07:15:40+05:30 IST