ప్రజల సౌకర్యార్థం సమీకృత మార్కెట్ ఏర్పాటు
ABN , First Publish Date - 2022-05-26T07:15:40+05:30 IST
పట్టణ ప్రజల సౌకర్యార్థం ఖానాపూర్లో సమీకృత మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అ న్నారు.
ఖానాపూర్, మే 25 : పట్టణ ప్రజల సౌకర్యార్థం ఖానాపూర్లో సమీకృత మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అ న్నారు. ఈ మేరకు పట్టణంలోని తహసీల్దార్ బంగ్లా ఆవరణలో బుధవారం సమీకృత మార్కెట్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా రూ, 3.90 కోట్లతో నిర్మిస్తున్న ఈ సమీకృత మార్కెట్లో వెజ్ స్టాల్స్, నాన్వెజ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. మున్సిపల్ చైర్మన్ అంకం రాజేంధర్, వైస్ చైర్మన్ ఖలీల్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్, కౌన్సిలర్లు కుర్మ శ్రీను, సంతోష్, పరిమి లత పాల్గొన్నారు.