ఉప ఎన్నికల్లో ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు
ABN , First Publish Date - 2021-04-24T05:24:28+05:30 IST
బోధన్ మున్సిపాలిటీలో 18వ వార్డు ఉప ఎన్నికల్లో కరోనా నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్లను ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి శ్రీనివాస్రావు తెలిపారు.
బోధన్, ఏప్రిల్ 23: బోధన్ మున్సిపాలిటీలో 18వ వార్డు ఉప ఎన్నికల్లో కరోనా నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్లను ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి శ్రీనివాస్రావు తెలిపారు. కరోనా పాజిటివ్ సోకి న వారికి, 80 యేళ్లు పై బడ్డ వృద్ధులకు, దివ్యాంగులకు, ఎన్నికల విధులు ఉన్నవారికి ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ ఉంటుందన్నారు. కొవిడ్ సోకిన వారికి పాజిటివ్ సర్టిఫికెట్, వృద్ధులకు ఆధార్కార్డు, దివ్యాంగులకు ధృవీకరణ పత్రం ఎన్నికల విధులు ఉన్నవారికి డ్యూటీ సర్టిఫికెట్ సమర్పించాలన్నారు.