ధాన్యం‌ కొనకుంటే సీఎం కేసీఆర్ గద్దె దిగాలి: ఈటల

ABN , First Publish Date - 2022-04-11T20:30:58+05:30 IST

కేసీఆర్ రాష్ట్రంలో ధాన్యం‌ కొనాలని, కొనకుంటే గద్దె దిగాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

ధాన్యం‌ కొనకుంటే సీఎం కేసీఆర్ గద్దె దిగాలి: ఈటల

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ధాన్యం‌ కొనాలని, కొనకుంటే గద్దె దిగాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పరిపాలన వదిలేసి దద్దమ్మ మాదిరి ఢిల్లీలో ఎందుకు దర్నా చేస్తున్నారో సీఎం చెప్పాలన్నారు. బంగాఖాతంలో కలుపుతారో.. కలుస్తారో.. ముఖ్యమంత్రితో తేల్చుకుంటామన్నారు. దేశంలో ఎక్కడా లేని సమస్య.. తెలంగాణలో మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో పీకే ప్లాన్స్  పని చేయవన్నారు. ఆత్మగౌరవం మాత్రమే పనిచేస్తుందన్నారు. మంత్రులు, అధికారులు ప్రజలంటే సీఎం కేసీఆర్‌కు లెక్కలేదని, ఐదారు వేల కోట్లతో రైతుల పంటను కొనలేని అసమర్థ ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. పీకే రాకతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైందని అర్థమవుతోందన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని, మహిళా గవర్నర్‌పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-11T20:30:58+05:30 IST