Etala: అసెంబ్లీకి హాజరు కాని ఈటెల రాజేందర్

ABN , First Publish Date - 2022-09-12T17:15:17+05:30 IST

అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరు కాలేదు.

Etala: అసెంబ్లీకి హాజరు కాని ఈటెల రాజేందర్

హైదరాబాద్ (Hyderabad): అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరు కాలేదు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో ఈటల అసెంబ్లీకి రాలేదు. మరోవైపు ఈటలను సభ నుంచి సస్పెండ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 6న స్పీకర్‌ను మరమనిషిలా వ్యవహరిస్తున్నారని ఈటల కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్‌పై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈటల క్షమాపణ చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. అయితే తన కామెంట్స్‌ను ఈటల సమర్థించుకున్నారు. దాంతో సోమవారం సభలో ఈటెలపై తీర్మానం పెడతారని జోరుగా చర్చ జరుగుతోంది. 


సోమవారం నుంచి బండి సంజయ్‌ నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర చేయనున్నారు. కుత్బుల్లాపూర్‌ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు పాదయాత్ర సాగనుంది. 10 రోజులు, 115 కిలోమీటర్లు జరుగుతుంది. ముందుగా చిత్తారమ్మా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభిస్తారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్‌బన్సల్‌ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈనెల 22న పెద్ద అంబర్‌పేట దగ్గర పాదయాత్ర ముగియనుంది. 

Updated Date - 2022-09-12T17:15:17+05:30 IST