నాయకులను కొనవచ్చు కానీ ప్రజలను కొనలేరు: ఈటల
ABN , First Publish Date - 2021-09-04T01:22:01+05:30 IST
హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులను కొనవచ్చు కానీ ప్రజలను కొనలేరని, ప్రజలు అమ్ముడు పోరని మాజీ మంత్రి
హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులను కొనవచ్చు కానీ ప్రజలను కొనలేరని, ప్రజలు అమ్ముడు పోరని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ ‘‘దళితవాడకు వెళ్లి ఇంటికో పది లక్షలు ఇస్తాం.. గులాబీ కండువా కప్పుకోవాలని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని విమర్శించారు. నా రాజీనామా వల్లే ఆగిపోయిన అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈటల రాజేందర్ ఉద్యమకారుడుగా మేలు చేసిండు, ఎమ్మెల్యేగా, మంత్రిగా మేలు చేసిండు. ఇప్పుడు రాజీనామా చేసి కూడా మేలు చేస్తున్నాడు. నియోజకవర్గంలో రోడ్లన్నీ వేసి అభివృద్ధి చేసిన ఘనత నాదే’’ అని రాజేందర్ తెలిపారు.