హోర్డింగ్లపై లేకున్నా.. కోట్ల మంది గుండెల్లో ఉన్నారు: ఈటల
ABN , First Publish Date - 2022-07-03T23:32:33+05:30 IST
హోర్డింగ్లపై లేకున్నా.. కోట్ల మంది గుండెల్లో ఉన్నారు: ఈటల
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజల సొమ్ముతో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టించారని పేర్కొన్నారు. మోదీ ఫొటో హోర్డింగ్లపై లేకున్నా.. కోట్ల మంది గుండెల్లో ఉన్నారని చెప్పారు. కేసీఆర్ ముఖం చుడ్డానికి ప్రజలు ఇష్టపడటం లేదన్నారు. కేసీఆర్ దళిత సీఎం అని చెప్పి వారి కళ్లలో మట్టికొట్టారని మండిపడ్డారు. ఎస్సీ బిడ్డను రాష్ట్రపతిగా చేసిన ఘనత ప్రధాని మోదీదన్నారు. ఇప్పుడు ఎస్టీ మహిళను రాష్ట్రపతి చేయాలని నిశ్చయించారని తెలిపారు.