మరి కాళేశ్వరం ఎందుకు కట్టారో చెప్పాలి?: ఈటల
ABN , First Publish Date - 2022-01-11T21:35:18+05:30 IST
17 జీవో వల్ల ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు త్వరలోనే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
మహబూబ్నగర్: 317 జీవో వల్ల ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు త్వరలోనే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. రైతులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులను వరి పంట వేయొద్దంటున్న కేసీఆర్ మరి కాళేశ్వరం ఎందుకు కట్టారో చెప్పాలి? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరిపోయే దీపం లాంటిదని విమర్శించారు.