సింగరేణి అభివృద్ధికి కలిసి రావాలి: ఈటల రాజేందర్

ABN , First Publish Date - 2022-04-25T22:34:42+05:30 IST

సింగరేణి అభివృద్ధికి కలిసి రావాలి: ఈటల రాజేందర్

సింగరేణి అభివృద్ధికి కలిసి రావాలి: ఈటల రాజేందర్

జయశంకర్ భూపాలపల్లి :  సంఘాలు ఏవైనా సింగరేణి అభివృద్ధికి కలిసి రావాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ పేరుతో కేంద్రంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో 70 శాతం మించి ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పిన కేసిఆర్, ఇప్పుడు 86 శాతం  ప్రైవేటీకరణ చేస్తున్న ఘనుడు కేసిఆర్ అని విమర్శించారు. 2018 ఎన్నికల తర్వాత కేసిఆర్ నైజమెందో ప్రజలకు అర్ధమైందన్నారు. ఇలాంటి నాయకున్నా మేము ఎన్నుకున్నది అంటూ సిగ్గు పడుతున్నారని మండిపడ్డారు. తనలాంటి ఉద్యమ బిడ్డ గొంతు పిసకాలని చూసాడు కేసిఆర్ అని ఆవేదన వ్యక్తం చేశారు. 63 వేల నుంచి 43 వేలకు కార్మికుల సంఖ్య పడిపోయింది దీనికి ప్రధాన కారణం సీఎం కేసిఆర్ అని స్పష్టం చేశారు. సింగరేణి అభివృద్ధిపై ఒక్కసారి కూడా కేసిఆర్ బొగ్గు శాఖ మంత్రిని కలవలేదన్నారు. ప్రైవేట్ కంట్రాక్టర్లకు సింగరేణిని అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. 

Updated Date - 2022-04-25T22:34:42+05:30 IST