తెలంగాణను దోచుకోవడానికి కుట్ర చేస్తున్నారు: ఈటల

ABN , First Publish Date - 2021-12-15T22:00:48+05:30 IST

హుజురాబాద్ ఎన్నికలు కేసీఆర్ దౌర్జన్యాన్ని, డబ్బును, అహంకారాన్ని అనగదొక్కడానికి జరిగిన ఎన్నికలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

తెలంగాణను దోచుకోవడానికి కుట్ర చేస్తున్నారు: ఈటల

జనగామ: హుజురాబాద్ ఎన్నికలు కేసీఆర్ దౌర్జన్యాన్ని, డబ్బును, అహంకారాన్ని అణగదొక్కడానికి జరిగిన ఎన్నికలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తన గెలుపు కొరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో సామాన్య జనం కూడా పూజలు నిర్వహించారని చెప్పారు. హుజురాబాద్ గెలుపు ధర్మం, న్యాయం, తెలంగాణ గెలుపుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. నేను గెలవకుండా, ఓడగొట్టడం కోసం కేసీఆర్ కుట్రలు పన్నడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలను ఓడగొట్టడానికి కుట్ర చేయడం లేదన్నారు. కేసీఆర్ కుట్రను అణగదొక్కుతామన్నారు. కేసీఆర్, వారి కుటుంబం ప్రాంతీయ పార్టీల ముసుగులో తెలంగాణను దోచుకోవడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2021-12-15T22:00:48+05:30 IST