సీఎం కేసీఆర్‌పై ఈటల ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-21T00:07:38+05:30 IST

ప్రధాని మోదీ దిష్టి బొమ్మలు దగ్థం చేయటం.. చావు డప్పులు కొట్టడం దుర్మార్గమంటోన్న మాజీమంత్రి... చాపు డప్పు కొట్టాల్సి వస్తే మెదట ప్రగతి భవన్ ముందు కొట్టి..

సీఎం కేసీఆర్‌పై ఈటల ఘాటు వ్యాఖ్యలు

కొల్లపూర్: ప్రధాని మోదీ దిష్టి బొమ్మలు దగ్థం చేయటం.. చావు డప్పులు కొట్టడం దుర్మార్గమంటోన్న మాజీమంత్రి... చాపు డప్పు కొట్టాల్సి వస్తే మెదట ప్రగతి భవన్ ముందు కొట్టి.. కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేయాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శాంతి భద్రతలు.. ఆస్తులు..‌ ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన ముఖ్యమంత్రే బీజేపీ నేతల మీద దాడులు చేయమనటం దారుణమన్నారు. దళితుడుని ముఖ్యమంత్రి చేయకుంటే తల నరుకుంటానని ద్రోహం చేసినందుకు ప్రగతి భవన్ ముందు చావు డప్పు కొట్టాలని మండిపడ్డారు. మూడు  ఎకరాలు భూమి.. నిరుద్యోగభృతి ఇవ్వనందుకు కేసీఆర్ దిష్టిబొమ్మ తగులబెట్టాలన్నారు. 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని మాట తప్పినందుకు కేసీఆర్‌కి చావు డప్పు కొట్టాలని ధ్వజమెత్తారు. హుజురాబాద్ దెబ్బకు ఫామ్ హౌస్ నుండి బయటకొచ్చిన కేసీఆర్.. మారువేషంలో ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. టీచర్ల ట్రాన్స్ఫర్ లల్లో  అన్యాయం జరుగుతుంటే ఎందుకు పరిష్కరించరు? అని ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2021-12-21T00:07:38+05:30 IST