ఉద్యమం నాటి KCRకు.. ఇప్పటి కేసీఆర్కు చాలా తేడా..: Etela
ABN , First Publish Date - 2022-06-14T21:33:17+05:30 IST
ఉద్యమం నాటి కేసీఆర్కు.. ఇప్పటి కేసీఆర్కు చాలా తేడా ఉందని
Siddipet జిల్లా: ఉద్యమం నాటి కేసీఆర్ (KCR)కు.. ఇప్పటి కేసీఆర్కు చాలా తేడా ఉందని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ (Etela Rajender) అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండాభూదేవి గార్డెన్లో నిర్వహించిన ప్రధాని మోదీ 8 ఏళ్ళ ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఒకప్పుడు కేసీఆర్ టీవీలో కనబడితే యువత కేరింతలు కొట్టేవారని.. ఇప్పుడు చీదరించుకుంటున్నారని అన్నారు. తాను పార్టీ మారలేదని, టీఆర్ఎస్ వాళ్ళే వెళ్లగొట్టారన్నారు. రెచ్చగొడితే ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై చర్చకు సిద్ధమని అన్నారు. కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరాలని చాలామంది ఎదురు చూస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు.