పోడుభూముల వివాదం త్వరగా పరిష్కరించాలి: Etala
ABN , First Publish Date - 2022-07-09T19:46:52+05:30 IST
పోడుభూముల వివాదం త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) డిమాండ్ చేశారు.
హైదరాబాద్: పోడుభూముల వివాదం త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం బ్రోకర్గా మారిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం వేల ఎకరాల భూమిని గుంజుకుని అమ్మకుంటుందని ఆరోపించారు. వారసత్వంగా వచ్చిన భూములను కూడా లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. దళితుల కళ్లల్లో మట్టికొడుతున్నారని మండిపడ్డారు. లక్షల అసైన్డ్ భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ చేస్తున్నారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.