ఏటూరునాగారం-వరంగల్ మధ్య రాకపోకలు బంద్

ABN , First Publish Date - 2022-07-27T14:38:15+05:30 IST

ఏటూరునాగారం-వరంగల్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. పస్రా-తాడ్వాయి మధ్య జనగలచవాగు పొంగి పొర్లుతుంది

ఏటూరునాగారం-వరంగల్ మధ్య రాకపోకలు బంద్

ములుగు: ఏటూరునాగారం-వరంగల్(Ethurunagaram-Warangal) మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. పస్రా-తాడ్వాయి మధ్య జనగలచవాగు పొంగి పొర్లుతుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. జనగలచవాగు ఉధృతితో 163 నేషనల్ హైవే ప్రమాదకరంగా మారింది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు రాకపోకలను నిలిపివేశారు. వారం క్రితం కురిసిన వర్షాలకు పస్రా-తాడ్వాయి మధ్య ఉన్న 163 నేషనల్ హైవే(163 National Highway) కొట్టుకుపోయింది. ఇటీవలే దానికి  అధికారులు మరమ్మతులు చేసి పూర్తిచేశారు. ఇక మరోసారి జనగలచవాగు పొంగిపోర్లుతుండటంతో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయావి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.

Updated Date - 2022-07-27T14:38:15+05:30 IST