ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్ర ఫలాలు దక్కాలి
ABN , First Publish Date - 2022-08-16T06:55:04+05:30 IST
డెబ్బయి ఐదేళ్ల స్వతంత్రభారతావనిలో అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలని గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ అన్నారు.
గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు శ్రీభరత్
విశాఖపట్నం: డెబ్బయి ఐదేళ్ల స్వతంత్రభారతావనిలో అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలని గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ అన్నారు. వర్సిటీలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు.అట్టడుగు వర్గాలను గుర్తించి వారిఅభ్యున్నతికి పాటు పడాలన్నారు. యువతరంలో సామాజిక స్పృహ పెరగాలని, ఇందుకు అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. వేడుకలలో గీతం కార్యదర్శి ఎం.భరద్వాజ, ప్రొ వైస్చాన్సలర్ వై.గౌతమ్రావు, రిజిస్ట్రార్ గుణశేఖరన్, డీన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.