ప్రతి ఒక్కరికి వాక్సిన్‌ అందించాలి

ABN , First Publish Date - 2021-01-16T05:07:01+05:30 IST

ప్రతి ఒక్కరికి విడతల వారిగా కరోనా నివారణ వాక్సిన్‌ను విడుతల వారిగా తప్పక అందించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ అన్నారు.

ప్రతి ఒక్కరికి వాక్సిన్‌ అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ

జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ

ఇల్లందకుంట, జనవరి 15: ప్రతి ఒక్కరికి విడతల వారిగా కరోనా నివారణ వాక్సిన్‌ను విడుతల వారిగా తప్పక అందించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్‌పర్సన్‌ సరిగోమ్ముల పావని-వెంకటేష్‌ ఆధ్వర్యంలో నేటి నుంచి అందించే కరోనా వాక్సిన్‌పై మండలాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ మాట్లాడుతూ కరోనా నివారణ వాక్సిన్‌పై ఎలాంటి అపోహలు ఉండవద్దని ప్రతి ఒక్కరు బాధ్యతగా వైద్య సిబ్బంది వద్ద తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది ప్రజల్లో వాక్సిన్‌పై అవగాహన కల్పించే విధంగా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఏడీఏ ఆదిరెడ్డి, తహసీల్దార్‌ సురేఖ, ఎంపీడీవో కృష్ణప్రసాద్‌, వైస్‌ ఎంపీపీ జ్యోత్స్న, మెడికలాఫీసర్‌ జ్యోత్స్న, వైద్య సిబ్బంది మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:07:01+05:30 IST