ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన వేయాలి

ABN , First Publish Date - 2021-05-09T04:32:54+05:30 IST

జిల్లాలో ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్‌ చేశారు.

ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన వేయాలి
డీఎమ్‌హెచవో కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 8: జిల్లాలో ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్‌ చేశారు. డీఎంహెచవో కార్యాలయం ఎదుట శనివారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేసి మాట్లాడారు. జిల్లాలో కరోనా విజృంభిస్తుంటే నివారణలో నిర్లక్ష్యం తగదన్నారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కిట్లు లేవనే సాకుతో టెస్టులు చేయకపోవడం దుర్మార్గమ న్నారు. అనంతరం జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి పెండెం వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కోట గోపి, ఎల్గూరి గోవింద్‌, వేల్పుల వెంకన్న, నరసింహరావు, వెంకటరెడ్డి, వీరబోయిన రవి, పల్లేటి వెంకన్న, సుందరయ్య పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-09T04:32:54+05:30 IST