ప్రతి ఒక్కరూ చట్టాన్ని పాటించాలి: కర్ణాటక సీఎం
ABN , First Publish Date - 2022-04-23T01:09:37+05:30 IST
ప్రతి ఒక్కరూ చట్టాన్ని పాటించాలి: కర్ణాటక సీఎం
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు. మతపరమైన ప్రదేశాలలో కొనసాగుతున్న లౌడ్ స్పీకర్ సమస్యను ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరూ చట్టాన్ని పాటించాలని సీఎం అన్నారు. శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి లౌడ్ స్పీకర్ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఆదేశాలు జారీ చేశామని సీఎం బొమ్మై చెప్పారు. ఆజాన్పై హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, దానికి అనుగుణంగా ఇప్పటికే సర్క్యులర్ జారీ చేయబడిందని ఆయన అన్నారు.