ప్రతి ఒక్కరూ అంబేద్కర్ బాటలో నడవాలి
ABN , First Publish Date - 2021-04-18T05:33:58+05:30 IST
భారత రాజ్యాంగా నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని జుక్కల్ ఎమ్మె ల్యే హన్మంత్ షిండే అన్నారు.
జుక్కల్, జనవరి 17: భారత రాజ్యాంగా నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని జుక్కల్ ఎమ్మె ల్యే హన్మంత్ షిండే అన్నారు. శనివారం జుక్కల్ మండలంలోని మహ్మ దాబాద్లో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో ఒ డిదుడుకులను ఎదుర్కొని, భారత రాజ్యాంగాన్ని రాసిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నీలు పటేల్, రవిశంకర్, సీఐటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పిట్లం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతీ ఒక్కరు నడ వాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. శనివారం మం డలంలోని మద్దెల్చెర్వు గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు అందరూ పాటిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ పండి త్రావ్, ఏఎమ్సీ చైర్మెన్లు విఠల్, సాయిరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోచ య్య, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు రాములు, రాష్ట్ర సమత సైనికదళ్ అధ్యక్షుడు రాజేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.