ఆలయాల అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషిచేయాలి
ABN , First Publish Date - 2021-01-24T05:16:59+05:30 IST
ఆలయాల అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషిచేయాలి
ఘట్కేసర్ రూరల్: శిధిలావస్థకు చేరిన ఆలయాలకు ప్రతిఒక్కరూ తమవంతు సాయం అందజేయాలని మండల పరిషత్ అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం, అవుశాపూర్ శివాలయం అభివృద్ధికి సింగిల్విండో డైరెక్టర్ జిల్లెలా పోచిరెడ్డి అతని కుమారులు రూ.5లక్షల చెక్కును అందజేశారు. అంతకు ముందు ఆలయంలో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి భక్తులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. దేవాలయాలలో కొంత సమయం గడిపితే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అయ్యిలయ్యయాదవ్, నాయకులు రాజశేఖర్రెడ్డి, మశ్చేందర్రెడ్డి, మల్లేష్, రవీందర్, దయాకర్రెడ్డి, ఆలయ పూజారి సాకేత్శర్మ పాల్గొన్నారు.