చంద్రబాబు పర్యటన కు సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2022-05-20T06:33:09+05:30 IST
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జి ల్లా పర్యటనకు సర్వం సిద్ధం చేశారు. గురువారం సాయంత్రం వీవీఆర్ ఫంక్షన హాల్లో ఏర్పాట్లను మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్, ధర్మవరం టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్లు వేర్వేరుగా పరిశీలించారు
అనంతపురం అర్బన, మే 19: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జి ల్లా పర్యటనకు సర్వం సిద్ధం చేశారు. గురువారం సాయంత్రం వీవీఆర్ ఫంక్షన హాల్లో ఏర్పాట్లను మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్, ధర్మవరం టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్లు వేర్వేరుగా పరిశీలించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు అనంతపురం నగర శివారులోని తపోవనం సమీపంలోని వీవీఆర్ ఫంక్షన హాల్లో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. సమావేశానికి చంద్రబాబు ముఖ్య అతిఽథిగా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం తర్వాత శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు.