-
-
Home » Andhra Pradesh » ex chief minister chandrababu naidu fires on cm jagan-MRGS-AndhraPradesh
-
CHANDRABABU: CORONA కంటే ప్రమాదకరమైన వ్యక్తి JAGAN
ABN , First Publish Date - 2022-05-05T03:39:02+05:30 IST
జగన్ ఒక్క చాన్స్ అనగానే అందరూ మాయలో పడ్డారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పొందూరు మండలం దళ్లవలసలో..
SRIKAKULAM: జగన్ ఒక్క చాన్స్ అనగానే అందరూ మాయలో పడ్డారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి CHANDRABABU అన్నారు. పొందూరు మండలం దళ్లవలసలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు TDP సభలో చంద్రబాబు మాట్లాడుతూ 151 సీట్లు రావడంతో JAGANలో అహంకారం పెరిగిందన్నారు. ‘‘నా ఇంటిపై దాడి చేయటమే కాకుండా అసెంబ్లీలో నన్ను అవమానించారు. నా కుటుంబసభ్యులను అవమానించారు. కరోనా కంటే ప్రమాదకరమైన వ్యక్తి జగన్. నిత్యావసరాల ధరలు భారీగా పెంచారు. విద్యుత్ ఉండదు కానీ.. బిల్లు మాత్రం బాదుడే బాదుడు. నేను ఫైబర్నెట్ రూ.140కి ఇస్తే... రూ.290కి పెంచారు. రాష్ట్రంలో విచిత్రమైన బ్రాండ్ల వల్ల నాటు సారా పెరిగింది. నేను జగన్లా దోచుకోలేదు... దాచుకోలేదు. ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తి కాలేదు. ప్రైవేటు రంగంలో 5.50 లక్షల ఉద్యోగాలు కల్పించాం. రైతుల మోటార్లకు జగన్ మీటర్లు పెడతానంటున్నారు. మోటార్లకు మీటర్లు పెడితే ఉచిత విద్యుత్ పోతుంది. పదో తరగతి ప్రశ్నపత్రాలు అమ్ముకుంటున్నారు. జగన్ పాలనలో ఆస్తులు, ఆడబిడ్డలు, ప్రాణాలకు రక్షణ లేదు. డ్రగ్స్కు చిరునామాగా ఏపీ మారింది.’’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.