ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల భేటీ

ABN , First Publish Date - 2022-06-07T16:42:33+05:30 IST

రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలు ప్రత్యేకించి రాజ్యసభ ఎన్నికల వేళ భేటీ కావడం సర్వత్రా కుతూహలంగా మారింది. సోమవారం బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో వీఐపీ

ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల భేటీ

                                  - రాజకీయంగా కుతూహలం 


బెంగళూరు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలు ప్రత్యేకించి రాజ్యసభ ఎన్నికల వేళ భేటీ కావడం సర్వత్రా కుతూహలంగా మారింది. సోమవారం బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో వీఐపీ లాంజ్‌లో రాష్ట్ర ప్రతిపక్షనేత సిద్దరామయ్య, మాజీ సీఎం యడియూరప్ప తారసపడ్డారు. కాసేపు కూర్చొని సంతోషంగా మాట్లాడుకున్నారు. కుటుంబీకుల గురించి ఆరా తీసి అభిప్రాయాలు పంచుకున్నారు. ఇద్దరు మాజీ సీఎంల భేటీ సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 

Updated Date - 2022-06-07T16:42:33+05:30 IST