రాజకీయంగా ముస్లింలను సమాధి చేస్తున్న సిద్దూ...

ABN , First Publish Date - 2022-06-02T17:49:48+05:30 IST

ప్రతిపక్షనేత సిద్దరామయ్య రాజకీయంగా ముస్లింలను సమాధి చేస్తున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమని జేడీఎ్‌సకు ముఖ్యనేత, మాజీ

రాజకీయంగా ముస్లింలను సమాధి చేస్తున్న సిద్దూ...

                     - విరుచుకుపడ్డ జేడీఎస్‌ నేత Kumaraswami


బెంగళూరు, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షనేత సిద్దరామయ్య రాజకీయంగా ముస్లింలను సమాధి చేస్తున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమని జేడీఎస్ కు ముఖ్యనేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ రెండో అభ్యర్థిగా మన్సూర్‌ అలిఖాన్‌ను బరిలోకి దించడాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు మైనారిటీలపై నిజంగా ప్రేమ ఉంటే మొదటి అభ్యర్థిగానే ప్రకటించి ఉండేదన్నారు. ఓడిపోతారనుకుంటున్న సీట్లనే మైనారిటీలకు మొక్కుబడిగా అంటగడుతున్నారని పేర్కొ న్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో వినాశకరమైన అధ్యాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ఇక్బాల్‌ మ హ్మద్‌ సరడగి, జాఫర్‌ షరీఫ్‌, రెహమాన్‌ షరీఫ్‌, రోషన్‌బేగ్‌, తన్వీర్‌ సేట్‌, సీఎం ఇబ్రహీం వంటి మైనారిటీల రాజకీయ భవిష్యత్తును చిదిమేసిన సిద్దరామయ్య తాజాగా మన్సూర్‌ అలిఖాన్‌ను బలిపీఠం ఎక్కించారని మండిపడ్డారు. అధిష్టానం పెద్దలు మేల్కొనకపోతే మైనారిటీలు కాంగ్రెస్ కు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 


Updated Date - 2022-06-02T17:49:48+05:30 IST