Ex Cmకు రామమనోహర్‌ లోహియా పురస్కారం

ABN , First Publish Date - 2022-03-19T17:26:36+05:30 IST

శాసనసభ ప్రతిపక్ష నేత సిద్దరామయ్యకు డాక్టర్‌ రామమనోహర్‌ లోహియా పురస్కారాన్ని భారత యాత్రాకేంద్రం నిర్వాహకులు ప్రకటించారు. బీఎల్‌ శంకర్‌, టీఎన్‌

Ex Cmకు రామమనోహర్‌ లోహియా పురస్కారం

బెంగళూరు: శాసనసభ ప్రతిపక్ష నేత  సిద్దరామయ్యకు డాక్టర్‌ రామమనోహర్‌ లోహియా పురస్కారాన్ని భారత యాత్రాకేంద్రం నిర్వాహకులు ప్రకటించారు. బీఎల్‌ శంకర్‌, టీఎన్‌ సీతారామ్‌, బీఆర్‌ పాటిల్‌తో కూడిన ఎంపిక కమిటీ సిద్దరామయ్యను ఈ పురస్కారం కోసం ఎంపిక చేసింది. ఈ నెల 23న సాయంత్రం చిత్రకళాపరిషత్‌లో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు భారత యాత్రాకేంద్రం ప్రధాన కార్యదర్శి కేవీ నాగరాజమూర్తి నగరంలో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విధానపరిషత్‌ సభాపతి బసవరాజ హొరట్టితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా విచ్చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2022-03-19T17:26:36+05:30 IST