పన్నుల భారంపై మండిపడ్డ Congress

ABN , First Publish Date - 2022-07-19T17:26:20+05:30 IST

నిత్యావసర వస్తువులు, ఆహార ధాన్యాలపై జీఎస్టీ విధించడం ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడిందని ప్రతిపక్షనేత సిద్దరామయ్య విరుచుకుపడ్డారు.

పన్నుల భారంపై మండిపడ్డ Congress

బెంగళూరు: నిత్యావసర వస్తువులు, ఆహార ధాన్యాలపై జీఎస్టీ విధించడం ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడిందని ప్రతిపక్షనేత సిద్దరామయ్య విరుచుకుపడ్డారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తదితర నేతలతో కలసి సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాలు, పెరుగుపై 5 శాతం జీఎస్టీ విధించడం దారుణమన్నారు. ధరల పెరుగుదల, పన్నుల భారంతో ప్రజలకు బీజేపీ అచ్ఛేదిన్‌ (మంచి రోజులను) బాగా చూపిస్తోందని ఎద్దేవా చేశారు. ఒక పక్క అక్రమాలు, కుంభకోణాలు, మరోపక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధరల బాదుడుతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని, తగిన గుణపాఠం చెప్పేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. మీడియా సమావేశంలో మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్‌ జీ పరమేశ్వర్‌, మాజీ మంత్రి దినేశ్‌ గుండూరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-19T17:26:20+05:30 IST