ముఖ్యమంత్రి సహాయ నిధికి మాజీ గవర్నర్‌ విరాళం

ABN , First Publish Date - 2020-10-21T23:32:59+05:30 IST

భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్‌నగరంలో నెలకొన్న పరిస్థితి పట్ల మాజీ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి మాజీ గవర్నర్‌ విరాళం

హైదరాబాద్‌: భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్‌నగరంలో నెలకొన్న పరిస్థితి పట్ల మాజీ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయ. పునరావాస కార్యక్రమాలను ఆయన అభినందించారు. సహాయ కార్యక్రమాల కోసం తన వంతు సాయంగా తన వ్యక్తిగత సేవింగ్స్‌ నుంచి 25వేల రూపాయలను సీఎంఆర్‌ఎఫ్‌కు అందించారు. పరిస్థితి త్వరగా కుదుట పడాలని ఆయన ఆకాంక్షించారు. మాజీ గవర్నర్‌ నరసింహన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-10-21T23:32:59+05:30 IST