America: సోషల్ మీడియాలో మహిళ మాటలు విని ఆగ్రహంతో ఊగిపోయిన మాజీ భర్త.. 1,100 కిలో మీటర్లు ప్రయాణించి మరీ..

ABN , First Publish Date - 2022-08-10T20:32:31+05:30 IST

ఇద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. అనంతరం ఐదేళ్లపాటు డేటింగ్‌లో మునిగి తేలారు. ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇంతలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో విడాకులు తీసుకుని ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. ఈ

America: సోషల్ మీడియాలో మహిళ మాటలు విని ఆగ్రహంతో ఊగిపోయిన మాజీ భర్త.. 1,100 కిలో మీటర్లు ప్రయాణించి మరీ..

ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. అనంతరం ఐదేళ్లపాటు డేటింగ్‌లో మునిగి తేలారు. ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇంతలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో విడాకులు తీసుకుని ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. ఈ క్రమంలోనే సదరు మహిళ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు అతడికి ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో 1,100 కిలో మీటర్ల దూరం ప్రయాణించి మరీ దారుణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అమెరికాలో చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


పాకిస్థాన్‌కు(Pakistan) చెందిన సానియా ఖాన్(Sania Khan) అనే మహిళ అమెరికాలో స్థిరపడ్డారు. ఈ క్రంమలోనే ఆమెకు రాహెల్ అహ్మద్(Rahel Ahmad) అనే వ్యక్తితో పరిచయం ఏరపడింది. ఆ పరిచయం ఆ తర్వాత డేటింగ్‌‌లో పాల్గొనే వరకూ వెళ్లింది. ఐదేళ్లపాటు డేటింగ్‌లో ఎంజాయ్ చేసి, 2021జూన్‌లో వివాహం చేసుకున్నారు. ఇద్దరు చికాగో(Chicago)కు షిఫ్టై కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లైన కొత్తలో సంతోషంగా ఈ దంపతులు సంతోషంగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అవికాస్తా గొడవలు వరకూ వెళ్లడంతో.. విడాకులు(Divorce) తీసుకుని వేరయ్యారు. ఆ తర్వాత సానియా ఖాన్ చికాగోలోనే నివాసం ఉంటుండగా.. అతడు మాత్రం జార్జియా వెళ్లిపోయాడు. 



ఈ క్రమంలోనే సానియా ఖాన్.. టిక్ టాక్ ద్వారా తన విడాకుల గురించి వివరిస్తూ.. మహిళలకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పింది. దీంతో అవికాస్తా వైరల్ కావడం.. అహ్మద్ కంట పడటం చకచకా జరిగిపోయాయి. టిక్ టాక్( TikTok) వీడియోల్లో సానియా ఖాన్ మాటలు విని అహ్మద్ ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే జార్జియా( Georgia) నుంచి చికాగోకు (సుమారూ.1,100 కిలోమీటర్లు) ప్రయాణించి.. ఆమెను గన్‌తో కాల్చి చంపేశాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికీ.. సానియా ఖాన్ మరణవార్త టిక్‌టాక్‌లో చక్కర్లు కొడుతుండటంతో ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2022-08-10T20:32:31+05:30 IST