మాజీ మంత్రి బొజ్జలకు శస్త్రచికిత్స
ABN , First Publish Date - 2021-03-06T17:36:33+05:30 IST
మాజీ మంత్రి బొజ్జలకు శస్త్రచికిత్స
చిత్తూరు/శ్రీకాళహస్తి : మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి శుక్రవారం హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి వైద్యులు గొంతు సంబంధిత శస్త్రచికిత్స నిర్వహించారు. నాలుగేళ్లుగా గొంతు సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో దుబాయ్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఆయనకు విజయవంతంగా ఆపరేషన్ జరిగినట్లు బొజ్జల కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కాగా, బొజ్జల ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ మండల టీడీపీ నేతలు పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర, దక్షిణ కాళికాదేవి, తొండమనాడు వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు జరిపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కామే్షయాదవ్, రాంబాబునాయుడు, దొరైరాజ్రెడ్డి, ఈశ్వరరెడ్డి, చెంచయ్యనాయుడు, దామోదర్రెడ్డి, విజయకుమార్, మునస్వామి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.