వైసీపీ ఉన్మాదానికి పరాకాష్ట: ఆలపాటి రాజా
ABN , First Publish Date - 2022-09-22T05:45:07+05:30 IST
ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడం వైసీపీ ఉన్మాదానికి పరాకాష్ట్ర అంటూ మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడం వైసీపీ ఉన్మాదానికి పరాకాష్ట్ర అంటూ మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించడమంటే తెలుగుజాతిని అవమానపరచడమేనని ఆయన చెప్పారు. హార్టికల్చర్ యూనివర్సిటీకి, కడప జిల్లాకు పెట్టిన వైఎస్సార్ పేరును టీడీపీ ప్రభుత్వం మార్చలేదని గుర్తు చేశారు. అంబేద్కర్ విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టడంతో పిచ్చికి పరాకాష్టకు చేరిందన్నారు. చారిత్రక పురుషులను అవమానపరుస్తూ జగన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నసీర్ అహ్మద్, పిల్లి మాణిక్యరావు, డేగల ప్రభాకర్, చిట్టాబత్తిన చిట్టిబాబు, నాయుడు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.