Former Minister: మాజీ మంత్రికి సుప్రీంకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2022-09-13T16:15:31+05:30 IST

మనీ ల్యాండరింగ్‌ కేసులో మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీకి విధించిన బెయిలు నిబంధనలను సుప్రీంకోర్టు సడలిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రప్రభుత్వ

Former Minister: మాజీ మంత్రికి సుప్రీంకోర్టులో ఊరట

ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 12: మనీ ల్యాండరింగ్‌ కేసులో మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీకి విధించిన బెయిలు నిబంధనలను సుప్రీంకోర్టు సడలిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోని ఆవిన్‌ సంస్థలో ఉద్యోగాల పేరుతో అక్రమార్జనకు పాల్పడ్డారన్న ఆరోపణల్లో అరెస్టయిన రాజేంద్ర బాలాజీ బెయిలుపై విడుదలయ్యారు. ఈ కేసులో తనకు విధించిన బెయిలు నిబంధనలు సడలించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్‌ వేశారు. సోమవారం ఈ పిటిషన్‌ విచారించిన న్యాయస్థానం, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజి తమిళనాడులోని ఏ ప్రాంతంలోనైనా పర్యటించవచ్చని, అదే సమయంలో విరుదునగర్‌ జిల్లా నుంచి బయటకు వెళ్తే విచారణ అధికారికి ముందే తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌కు అనుమతించిన న్యాయస్థానం, రాజేంద్ర బాలాజీ(Rajendra Balaji)కి మరో నాలుగు వారాలకు బెయిలు పొడిగిస్తూ, విచారణకు కూడా మరో నాలుగు వారాలకు వాయిదావేసింది.

Updated Date - 2022-09-13T16:15:31+05:30 IST