ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి

ABN , First Publish Date - 2021-01-17T06:00:04+05:30 IST

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి

జి.కొండూరు, జనవరి 16: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ 25వ వర్ధంతి సందర్భంగా ఈనెల 18న జరిగే మెగా రక్తదాన శిబిరాల్లో ప్రతి ఒక్కరూ విధిగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రక్తదానం చేయడమే ఎన్టీఆర్‌కు ఇచ్చే ఘనమైన నివాళి అని ఆయన అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం పార్టీ కార్యాలయాల్లో సోమవారం ఉదయం నుంచి జరిగే లెజెండరీ బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. 

Updated Date - 2021-01-17T06:00:04+05:30 IST