మూడేళ్లుగా గ్రాపిక్స్‌

ABN , First Publish Date - 2022-06-28T05:09:37+05:30 IST

టిడ్కో గృహాలు మరమ్మత్తులు చేయించి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్ల నుంచి వాటిని అందించకుండా ప్రజలకు గ్రాఫిక్స్‌ సినిమాల మాదిరి చూపిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు.

మూడేళ్లుగా గ్రాపిక్స్‌
సమావేశంలో మాట్లాడుతున్న మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తదితరులు

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

తెనాలి రూరల్‌, జూన్‌ 27: టిడ్కో గృహాలు మరమ్మత్తులు చేయించి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్ల నుంచి వాటిని అందించకుండా ప్రజలకు గ్రాఫిక్స్‌ సినిమాల మాదిరి చూపిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. తెనాలిలో సోమవారం  ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని చెబుతూనే పన్నుల భారంతో ప్రజలకు వణికిస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ ముఖ్యమంత్రి కూడా పెంచని విధంగా మంచినీటి పన్ను, గ్రీన్‌ ట్యాక్స్‌. కోల్డ్‌ ట్యాక్స్‌, మీసేవా సర్వీసుల ఛార్జీల పెంపు, సంక్షేమ హాస్టల్‌, ఆర్టీసీ బస్సు ఛార్జీలు. విద్యుత్‌ ఛార్జీలు, ఇసుక, సిమెంట్‌, పరిశ్రమలపై, వాహనాల జరిమానాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కదాన్ని మినహాయిపు లేకుండా, పన్నుల బాదుడుకు తెరలేపారని విమర్శించారు. రైతులకు మేలు చేస్తున్నామంటూనే వారి వద్ద కూడా వివిధ రకాలుగా పన్నులు విధించి వసూల్లకు పాల్పడుతున్నారని అధి రాష్ట్రానికి క్షేమం కాదన్నారు.


Updated Date - 2022-06-28T05:09:37+05:30 IST