వైసీపీ ప్రభుత్వం ప్రజల కష్టాన్ని దోచుకుంటోంది

ABN , First Publish Date - 2021-04-17T05:38:26+05:30 IST

వైసీపీ ప్రభుత్వం బందిపోటులా ప్రజల కష్టాన్ని దోచుకుంటోందని టీడీపీ నరసరావుపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వం ప్రజల కష్టాన్ని దోచుకుంటోంది

టీడీపీ నరసరావుపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు

గుంటూరు, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం బందిపోటులా ప్రజల కష్టాన్ని దోచుకుంటోందని  టీడీపీ నరసరావుపేట పార్లమెంట్‌  అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. శుక్రవారం ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని ప్రజలు నమ్మించిన జగన్‌ రెండేళ్లలో మూడుసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచడం దారుణమన్నారు. గతేడాది స్లాబుల పేరుతో మాయచేసి రూ.1,500 కోట్లు భారం ప్రజలపై మోపడమే కాక ప్రస్తుతం కొత్త టారిఫ్‌ పేరుతో కిలో వాట్‌కు రూ.10 చొప్పున పెంచుతున్నారన్నారు. టీడీపీ హయాంలో ఒక్కో ఇంటికి రూ.200 బిల్లు వస్తే నేడు రూ.2వేల వరకు వస్తోందన్నారు. ఏటేటా విద్యుత్‌ చార్జీలు పెంచి ఆదాయాన్ని రాబట్టుకోవాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. సోలార్‌ కంపెనీలకు బినామీలకు కట్టబెట్టి రూ.20 కోట్లు కొట్టేశారన్నారు. పన్నులు, ధరల పెంపుతో ప్రజల్ని కాల్చుకు తింటున్న జగన్‌రెడ్డిని బాదుడురెడ్డి అనడంలో తప్పులేదన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తే ప్రజలంటే భయం పుట్టుకొస్తుందని జీవీ తెలిపారు. 

Updated Date - 2021-04-17T05:38:26+05:30 IST